
పాల్గొన్న సర్పంచ్ సుజాత కళ్యాణ్ నాయక్.
విజేత ఎల్లారెడ్డిపేట: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం దేవునిగుట్ట తండా గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్నటువంటి యూనిఫాం లను సోమవారం సర్పంచ్ సుజాత కళ్యాణ్ నాయక్ లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు ప్రభుత్వం ఉచితంగా యూనిఫాం లను అందిస్తుందని, ప్రభుత్వ పాఠశాలలోనే మెరుగైన విద్యా బోధన అందుతుందని తెలిపారు. ప్రభుత్వ పాఠశాల అభివృద్ధికి,విద్యాభివృద్ధికి, విద్యార్థులకు ప్రోత్సాహకాలు అందించుటకు ఎల్లప్పుడూ గ్రామపంచాయతీ పాలకవర్గం అండగా ఉంటుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ సుజాత కళ్యాణ్ నాయక్, వార్డు సభ్యులు రాంసింగ్ నాయక్, బుజ్జిబాయి, ఉపాధ్యాయులు రోజా, అంజలి, అంగన్వాడీ టీచర్ జ్యోతి, గ్రామ కార్యదర్శి పవిత్ర, గ్రామ నాయకులు సురేష్, విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.








