ప్రభుత్వ పాఠశాల, సంస్కృతి స్కూల్‌లో వన మహోత్సవం

– ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు తమ వంతు బాధ్యతగా కృషి చేయాలి

– చేవెళ్ల మున్సిపల్ చైర్‌పర్సన్ దేవర సమత వెంకట్‌రెడ్డి,

విజేత,చేవెళ్ల : చేవెళ్ల మండలం పామేన గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల, సంస్కృతి స్కూల్‌లో వన మహోత్సవంలో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చేవెళ్ల మున్సిపల్ చైర్‌పర్సన్ దేవర సమత వెంకట్‌రెడ్డి, స్థానిక కౌన్సిలర్ ధవల్గారి గోపాల్‌రెడ్డి పాల్గొని మొక్కలు నాటారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు తమ వంతు బాధ్యతగా కృషి చేయాలని సూచించారు. నాటిన మొక్కలను సంరక్షించి అవి పెద్దవిగా పెరిగేలా చూడాలని కోరారు. పచ్చదనం పెంపుతోనే ఆరోగ్యకరమైన వాతావరణం సాధ్యమవుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో వైస్ చైర్మన్, కౌన్సిలర్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు

ఇవి కూడా చదవండి :

తాజా వార్తలు చదవండి :