జనసేన పేట నియోజకవర్గ ఇన్చార్జ్ గెడ్డం బుజ్జిని పరామర్శించిన వంగవీటి ఆశాకిరణ్

విజేత,పాయకరావుపేట : జనసేన పార్టీ పాయకరావుపేట నియోజకవర్గం ఇంచార్జ్, అన్నవరం దేవస్థానం ట్రస్ట్ బోర్డ్ సభ్యులు గెడ్డం బుజ్జి ఆరోగ్య పరిస్థితి బాగాలేదని తెలుసుకున్న వంగవీటి ఆశాకిరణ్ ప్రత్యేకంగా మండలంలోని గుంటపల్లి లో గల జనసేన సీనియర్ నాయకులు బుజ్జి నివాసానికి విచ్చేసిన ఆమె ఆప్యాయంగా పరామర్శించి ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. మండలంలోని మంగవరం గ్రామంలో కాపునాడు,రాద రంగా మిత్ర మండలి సభ్యులు ఆదివారం నిర్వహించిన దివంగత కాపునాడుg నేత స్వర్గీయ వంగవీటి మోహన్హ రంగా విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆయన కుమార్తె వంగవీటి ఆశాకిరణ్ ఈకార్యక్రమంఅనంతరం జనసేన పార్టీ సీనియర్ నాయకులు గెడ్డం బుజ్జి ఇంటికి వెళ్లినా ఆమె ఆయన్ని పరామర్శించడంతో పాటు ఎంతో ఆప్యాయంగా పలకరించడం పట్ల బుజ్జి ఆనందం వ్యక్తం చేశారు. ఆప్తులు, శ్రేయోభిలాషులు వంగవీటి ఆశాకిరణ్ ప్రత్యేకంగా విచ్చేసి పరామర్శించడం పట్ల తనకెంతో ఆనందాన్ని, ధైర్యాన్ని ఇచ్చిందని అన్నారు.వారిఅభిమానానికి, చూపిన ఆప్యాయత,ఆత్మీయతకు జనసేన పార్టీ నియోజకవర్గం ఇంచార్జ్,అన్నవరం దేవస్థానం ట్రస్ట్ బోర్డ్ సభ్యులు గెడ్డం బుజ్జి వంగవీటి ఆశాకిరణకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసారు.

ఇవి కూడా చదవండి :

తాజా వార్తలు చదవండి :