
విజేత, చిలుకూరు : నారాయణపురం, పాలెన్నారం, గ్రామంలో ముత్యాలమ్మ తల్లి నూతన విగ్రహాల వద్దకు మహిళలు ప్రతి ఇంటి నుంచి జలబిందలతో నీటిని తీసుకొచ్చి ముత్యాలమ్మ తల్లికి భక్తి శ్రద్ధలతో జలాభిషేకం చేశారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించి. గ్రామ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని పాడిపంటలు సమృద్ధిగా పండాలని మొక్కుకున్నారు. మహిళలు జల బిందెలతో తరలివస్తుండడంతో ఆలయ పరిసరాలలో పండుగ వాతావరణం నెలకొంది. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ముక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో మహిళలు గ్రామ పెద్దలు యువతీ యువకులు పాల్గొన్నారు.








