
విజేత, తాండూరు: బీసీల ఐక్యతే ధ్యేయంగా రాజకీయ సాధికారతే లక్ష్యంగా ఢిల్లీలో నిర్వహించనున్న బీసీ దండోరాకు సిద్ధం కావాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య పిలుపునిచ్చారు. ఈ మేరకు గురువారం వికారాబాద్ జిల్లా తాండూర్ బీసీ సంఘం ప్రతినిధులు హైదరాబాదులోని బీసీ భవన్ లో వారిని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా రాజకీయ సామాజిక సాధికారత లో బీసీల భాగస్వామ్యం కోసం కొనసాగుతున్న ఉద్యమాలు కార్యక్రమాలలో ప్రతి ఒక్కరూ కలసి ముందుకు సాగాలని చర్చించారు. వచ్చేనెల్లో బీసీ హక్కులు రాజకీయ సాధికారత రిజర్వేషన్ల పరిరక్షణ రాజ్యాంగబద్ధ హక్కుల సాధన కోసం భారీ స్థాయిలో బీసీ దండోరా కార్యక్రమాన్ని ఢిల్లీలో నిర్వహిస్తున్నట్లు ఆరు కృష్ణయ్య పేర్కొన్నారు. బీసీ లందరూ సంఘటితంగా దేశవ్యాప్తంగా ఉన్న బీసీ నాయకులు ప్రజా ప్రతినిధులు యువత సామాజిక కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఈ సందర్భంగా వారు పిలుపు నిచ్చారు. తాండూరులో కందుకూరి రాజ్ కుమార్ నేతృత్వంలో బీసీ ఉద్యమం లో తాండూరు ప్రాంతానికి చెందిన బీసీ సంఘం నాయకులు సయ్యద్ షుకుర్, అనిత, బసవరాజ్, మంజుల ముదిరాజ్, పరమేశ్, రాజు, మంబాపూర్ మంజుల బీసీ ఉద్యమం బలంగా కొనసాగుతూ ఉండటం అభినందనీయమని ఈ సందర్భంగా వారు అన్నారు.




