కొండకర్ల సబ్‌స్టేషన్ పరిధిలో గురువారం కరెంట్ బంద్..!

ఎంజే పురంలో ఉదయం 10 నుంచి సాయంత్రం 3 వరకు సరఫరా నిలిపివేత

అచ్యుతాపురం , : ఆర్‌డిఎస్‌ఎస్ పనుల్లో భాగంగా 33/11కెవి కొండకర్ల సబ్‌స్టేషన్ పరిధిలోని 11కెవి ఎంజే పురం ఫీడర్‌పై మరమ్మతులు చేపట్టనుండటంతో 11-06-2026 గురువారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 3 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు ఏపీఈపీడీసీఎల్ ఆపరేషన్ అనకాపల్లి ఈఈ ఎస్.రామకృష్ణ తెలిపారు.ఈ సమయంలో కొండకర్ల సెక్షన్ పరిధిలోని ఎంజే పురం గ్రామానికి విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని పేర్కొన్నారు. ప్రజలు అవసరమైన ఏర్పాట్లు చేసుకొని సహకరించాలని కోరారు.

ఇవి కూడా చదవండి :

తాజా వార్తలు చదవండి :