వేములవాడ కోర్టు ఆవరణలో ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ జన్మదిన వేడుకలు

విజేత, వేములవాడ : రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ కోర్టు ఆవరణలో న్యాయవాదుల ఆధ్వర్యంలో వేములవాడ శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా కేక్ కట్ చేసి ఆది శ్రీనివాస్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయనకు ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు కలగాలని, ప్రజలకు మరింత సేవ చేసే అవకాశం కలగాలని ఆకాంక్షించారు. “ప్రజాసేవలో ప్రతి అడుగు ప్రజల సంక్షేమం వైపు సాగాలి; సేవా భావంతో పనిచేసే నాయకత్వానికి ప్రజల ఆశీస్సులే గొప్ప బలం.”ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు పిట్టల మనోహర్, సీనియర్ అండ్ జూనియర్ కోర్ట్ ఏజిపి లు బొడ్డు ప్రశాంత్ కుమార్, పుప్పాల భానుకృష్ణ, మాజీ అధ్యక్షులు వేముల సుధాకర రెడ్డి, పెంట రాజు, సీనియర్ న్యాయవాదులు కొడిమ్యాల పురుషోత్తం,నాగుల సంపత్,జెట్టి శేఖర్ అన్నపూర్ణ,సరిత, వేణు కుమార్,బీమా మహేష్, మహేందర్, పద్మ,సుజాత, మమత, మహేష్,రమేష్ లావణ్య, పావని, నాగేంద్రబాబు రాజు,పావని నిఖిల్ న్యాయవాదులు ఇతరులు పాల్గొని ఆది శ్రీనివాస్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

ఇవి కూడా చదవండి :

తాజా వార్తలు చదవండి :