
న్యూఢిల్లీ, జూన్ 10: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భారత రాజకీయ చరిత్రలో మరో మైలురాయిని అధిగమించారు. ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ప్రధానిగా అత్యధిక కాలం పదవిలో కొనసాగిన నాయకుడిగా ఆయన కొత్త రికార్డు సృష్టించారు. బుధవారం నాటికి మోదీ 4,399 రోజుల పాటు ప్రధానమంత్రి పదవిలో కొనసాగి, దేశ తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ పేరిట ఉన్న 4,398 రోజుల రికార్డును అధిగమించారు.
జవహర్లాల్ నెహ్రూ మొత్తం 6,130 రోజుల పాటు ప్రధానిగా సేవలందించినప్పటికీ, 1947 ఆగస్టు 15 నుంచి 1952 మే 12 వరకు ఆయన ఎన్నికల ద్వారా కాకుండా పదవిలో కొనసాగారు. దేశంలో తొలి సాధారణ ఎన్నికలు పూర్తైన అనంతరం మాత్రమే ఎన్నికైన ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు.
ఈ నేపథ్యంలో ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ప్రధానిగా అత్యధిక కాలం పదవిలో కొనసాగిన నాయకుడిగా నరేంద్ర మోదీ చరిత్ర సృష్టించినట్లు రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి.







