విద్యార్థులే ఉపాధ్యాయులైన వేళ!!
విద్యార్థులే ఉపాధ్యాయులైన వేళ!!
అక్షర విజేత సిద్దిపేట
తొగుట మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాల విద్యార్థిని విద్యార్థులు స్వయం పరిపాలన దినోత్సవమును ఘనంగా జరుపుకున్నారు. ఉదయం ప్రార్థన నుండి సాయంత్రం ప్రార్థన వరకు విద్యార్థిని విద్యార్థులే టీచర్లుగా వ్యవహరించి తరగతులు నిర్వహించారు.బుధవారం ఈ కార్యక్రమంలో ఐదవ తరగతి విద్యార్థులే ఉపాధ్యాయులై మిగతా తరగతుల పిల్లలకు పాఠాలు బోధించారు. ఉపాధ్యాయులకు వ్యవహరించడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో డి ఈ ఓ గా ఎ. సిరి, ఎం ఈ ఓ గా బి పావని, హెచ్ఎం గా బి గా ఆంజనేయులు వ్యవహరించారు. ఈ కార్యక్రమానికి పర్యవేక్షకులుగా ప్రధానోపాధ్యాయులు ఎస్ శ్రీనివాస్ సార్. మరియు సత్యవతి, రాములు , రామకృష్ణారెడ్డి , భాస్కర్ , మరియు సురేష్ పాల్గొన్నారు.