బాసరపుర వీధుల్లో ఏకాదశి సందర్భంగా బాసర గ్రామస్తులు నగర సంకీర్తనలో పాల్గొన్నారు
బాసరపుర వీధుల్లో ఏకాదశి సందర్భంగా బాసర గ్రామస్తులు నగర సంకీర్తనలో పాల్గొన్నారు
అక్షర విజేత : నిర్మల్ జిల్లా : బాసర
బాసర ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన చదువుల తల్లి క్షేత్రంలో పూర్వ కాలంలో జరిగే సంకీర్తన కార్యక్రమాన్ని ప్రతీ గ్రామము నందు నగర సంకీర్తన కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నమని వ్యాసపురి బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు. పూజారి వెంకటేష్ తెలిపారు.లోక కళ్యాణర్థం చేపట్టిన ఈ విశేష కార్యక్రమల్లో గ్రామస్తులు స్వచ్ఛందంగా పాల్గొన్నారు.ఇట్టి పూజా కార్యక్రమంలో భాగంగా శారీరక, దృఢత్వం.జ్ఞాన సంపద.అందరిలో చైతన్యం పెరగడం.ఐకమత్యం. సనాతన ధర్మరక్షణ. వచ్చే భావి తరాలకి మంచి మార్గ నిర్దేశం జరుగుతుందన్నారు బ్రాహ్మణోత్తములు.కుల మత భేదములు లేకుండా అందరు ప్రతీ ఏకాదశి రోజు ఉదయం 5 నుండి 6 వరకు గ్రామము నందు భగవంతుని నామ స్మరణ చేస్తూ సాంప్రదాయ పద్దతిలో గ్రామ వీధులుకుండ ప్రదిక్షిన చేయడం జరుగుతుందన్నారు. ఇప్పుడున్న కాలానికి ఎంతైన అవసరమని నేడు ఏకాదశి రోజు సందర్భంగా నగర సంకీర్తనతో పురవీధులు హరిజనవడా మారెమ్మ ఆలయం నుండి ప్రారంభించారు.