హత్య కేసులో నిందితుని పట్టుకున్న పోలీసులు
అక్షర విజేత పిట్లం.
కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలో పిట్లం మండలంలోని కారెగాం తండా గ్రామానికి చెందిన నునావత్ కిషన్ తండ్రి బాబ్యా నాయక్ 45 ఈనెల 12న 10:00 గంటలకు ఇంటి నుండి బయలుదేరిన ఆయన పిట్లం గ్రామ మారేడు చెరువు కట్ట పైన 13నా డు శవం లభించింది మృతుని తమ్ముడు శ్రీనివాస్ ఫిర్యాదు
మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయగా నిందితుడిని సీసీ కెమెరాల ఆధారంగా నిందితుడిని గుర్తించారు నిందితుడు పిట్లం గ్రామానికి చెందిన నిజ్జ మోహన్ అని నిర్ధారణ చేసి అతని ఇంటికి వెళ్లి పట్టుకొని బాన్సువాడ రూరల్ సిఐ పి సత్యనారాయణ విచారించగా నేరంను అంగీకరించగా నిందితుడిని రిమాండ్ కు తరలించారు. ఈ కార్యక్రమంలో పిట్లం ఎస్ఐ నిరేష్ మరియు పోలీస్ సిబ్బంది రవిచంద్ర తదితరులు పాల్గొన్నారు.