సచిన్ కి కౌంటర్ ఇచ్చిన సన్‌రైజర్స్ బౌలర్




వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న ఆందోళనకు ప్రపంచ వ్యాప్త మద్దతు పెరుగుతున్న వేళ భారతీయ సెలబ్రెటీల నుంచి భిన్నమైన వాదనలు వినిపిస్తన్నాయి. అంతర్జాతీయ సెలబ్రెటీలు రైతులకు మద్దతు ప్రకటించడాన్ని తప్పుబడుతూ భారత క్రీడాకారులు సచిన్ టెండుల్కర్, కొహ్లీ, సైనా నెహ్వాల్ తదితరులు ఇండియా టుగెదర్ అంటూ ప్రచారాన్ని లంఘించారు. అటు విదేశాంగ శాఖ మంత్రి సైతం అంతర్జాతీయ సెలబ్రెటీల స్పందనను తప్పుబట్టింది. దేశానికి వ్యతిరేకంగా అంతర్జాతీయ కుట్ర జరుగుతోందని అభిప్రాయపడింది. కాగా... తోటి క్రీడాకారుల అభిప్రాయాలకు సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్ సందీప్ శర్మ గట్టి కౌంటర్ ఇచ్చారు. 

రైతులకు మద్దతు ప్రకటించిన రిహన్నా, గ్రెటాలకు సంఘీభావం తెలిపారు. అంతర్గత విషయాలని గిరి గీసుకుని కూర్చుంటే,  ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా మనకెందుకులే అని వదిలేయాల్సి ఉంటుందంటూ ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ చేశారు. అదే కామెంట్ ను ట్విట్టర్ లోనూ షేర్ చేశారు. కాగా... సందీప్ కొద్దిసేపటికే ఆ పోస్ట్ ని డిలీట్ చేయడం గమనార్హం. పంజాబ్ రాష్ట్రానికి చెందిన సందీప్ శర్మ గతంలోనూ రైతు ఉద్యమానికి మద్దతుగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టాడు. 


Latest News
more

Trending
more