మెగా హీరో సాయి తేజ్ ప్రమాదంలో కొత్త కోణం - బైక్ రేసింగే కారణమా ?




మెగా హీరో సాయి ధరమ్ తేజ్ కు జరిగిన ప్రమాదం బైక్ రేసింగ్ వల్లే జరిగిందా ? సీనియర్ నటుడు నరేష్ మాట్లాడిన మాటలు, ప్రమాదం తీరు చూస్తే అదే మాట నిజమనే అనుమానాలు వస్తున్నాయి. నరేష్ కుమారుడు, సాయుధరమ్ తేజ్ ఇద్దరు మంచి స్నేహితులని, కలిసి బైక్ రైడింగ్ లు చేస్తారని, చాలా స్పీడ్ గా నడుపుతారని నరేష్ అన్నారు. అలా స్పీడ్ గా నడపకుండా  వాళ్ళిద్దరికీ కౌన్సిలింగ్ చేయాలనుకున్నాన్నాడు నరేష్. నిన్న కూడా ఇద్దరు కలిసి తమ ఇంటి నుండే బయలు దేరారని తెలిపాడు నరేష్. 

అంతే కాక కొన్ని సీసీ టీవీల్లో రెండు బైక్ లు ఒకదానితో ఒకటి పోటీ పడుతూ దూసుకపోతున్న విజువల్స్ కనిపించాయంటున్నారు. బైక్ రేసు వల్లే ఈ ప్రమాదం జరిగిందా అనే అనుమానాలున్న నేపథ్యంలో పోలీసులు కూడా ఈ విషయంపై దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. సాయి ధరమ్ తేజ్, నరేష్ కుమారుడు నవీన్ తో సహా మరో వ్యక్తి బైక్ రేసులో పాల్గొన్నారనే అనుమానాలున్నాయి. 

శుక్రవారం రాత్రి 7 గంటల 58 నిమిషాలకు సాయితేజ్ దుర్గం చెరువు కేబుల్ బ్రడ్జిపై వెళ్తున్నట్లు సీసీటీవీలో రికార్డు అయింది. 8 గంటలకు కోహినూర్ హోటల్ దాటి ఐకియా వైపు దూసుకెళ్లారు. ఆ తర్వాత కొద్ది సేపటికే 8 గంటల 5 నిమిషాలకు బైక్ అదుపుతప్పి సాయితేజ్ కిందపడ్డారు. ప్రమాదానికి గురైన సాయితేజ్‌ను రాత్రి 8 గంటల 26 నిమిషాలకు స్థానికంగా ఉన్న మెడికవర్ ఆస్పత్రికి తరలించారు.

సీసీ టీవీ ఫుటేజ్ చూస్తే సాయిధరమ్ తేజ్ చాలా స్పీడ్ గా దూసుకపోతున్నట్టు అర్దమవుతోంది. 120 కిలోమీటర్ల స్పీడ్ లో ఉన్నట్టు తెలుస్తోంది. 


Latest News
more

Trending
more