మేడికొండ రోడ్డు బాగు చేయండి మహాప్రభో!




మేడికొండ రోడ్డు బాగు చేయండి మహాప్రభో! 
౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼
ధర్నాతో భారీగా స్తంభించిన ట్రాఫిక్

అధికారుల, నాయకుల తీరును ఎండగట్టిన ప్రయాణికులు

అక్షర విజేత అలంపూర్

2018 సంవత్సరం నుండి నేటి వరకు కంకర వేసి రోడ్డును అర్ధాంతరంగా నిలిపివేసిన రోడ్డును వెంటనే బాగు చేసి ప్రజలకు సౌకర్యం కల్పించాలని ప్రజలు డిమాండ్ చేశారు
అయిజ నుండి ఆరు గ్రామాలను కలుపుతూ మేడికొండ మీదుగా వెళ్లే అంతర్రాష్ట్ర రహదారిని బాగుచేయాలని ప్రయాణికులు తుపత్రాళ్ల సమీపంలో ధర్నా నిర్వహించారు. బుధవారం ఆయా గ్రామాలకు చెందిన రెండు వందల మంది ప్రజలు ఈ రోడ్డును బాగుచేయాలంటూ ధర్నాకు దిగారు. 2018 నుండి కంకర పరిచి వదిలిన ఈ రోడ్డును బాగుచేయక పోవటం వల్ల ఎంతో మంది ప్రయాణికులు ప్రమాదాలకు గురయ్యారని ఆవేదన చెందారు. ప్రజల ప్రాణాలు పట్టించుకోని ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ఉద్యోగులు ఉండి ప్రయోజనమేమని ప్రశ్నించారు. రోడ్డు నిర్మాణం చేయాలని ప్రయాణికులు చేసిన ధర్నా వల్ల భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది.  వాహన దారులకు పూర్తి ఇబ్బంది కలగటంతో కొంతమంది కల్పించుకుని ధర్నాను విరమింపజేశారు. తక్షణమే రోడ్డును బాగు చేసి ప్రజలకు ఇబ్బంది కలగకుండా బాగు చేసి  రాకపోకలకు సౌకర్యం కల్పించాలని లేనిచో మళ్లీ ధర్నా కార్యక్రమాలు చేపడతామని స్థానిక నాయకులకు అధికారులకుప్రజలు విజ్ఞప్తి చేశారు.
 


Latest News
more

Trending
more