Tokyo Olympics: సింధు గెలిచింది - భారత్ కు మరో పతకం తెచ్చింది




దేశ ప్రజలందరూ తనపై పెట్టుకున్న ఆశను (PV Sindhu) పీవీ సింధూ నిలబెట్టింది. (Tokyo ) టోక్యోలో జరుగుతున్న ఒలంపిక్స్ లో  షట్లర్ సింధు పతకం సాధించింది. (bronze medal) కాంస్య పతకం కోసం చైనా క్రీడాకారిణి  (He Bing jiao) హే బింగ్ జియావో తో సాగిన పోరులో 21-13, 21-15 తో సింధు విజయం సాధించింది. 

నిన్న సెమీస్ లో తై జు యింగ్ చేతిలో సింధు ఓడిపోవడంతో ఈ రోజటి ఆటలో ఏం జరగనున్నదో అనేదానిపై  దేశమంతా ఆసక్తిగా ఎదిరి చూసింది. కాంస్య పతకం కోసం ఈ రోజు జరిగిన మ్యాచ్ లో సింధు గెలవాలని భారత దేశమంతా కోరుకుంది. నిన్న ఓడిపోయినప్పటికీ ఆత్మనిబ్బరం కోల్పోని సింధూ ఈరోజటి మ్యాచ్ లో ఎటువంటి పొరపాట్లు జరగకుండా చూసుకుంది. ఆట ప్రారంభం నుండే దూకుడుగా ఆడి ప్రత్యర్దికి ఏ మాత్రం అవకాశం ఇవ్వలేదు సింధు. చివరి వరకు ప్రత్యర్ది బింగ్ జియావోకు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా విజృంభించి టోక్యో ఒలంపిక్స్ లో త్రివర్ణ పతాకం ఎగరవేసింది సింధు. 


Latest News
more

Trending
more