పూజా హెగ్డేకే హయ్యెస్ట్ రెమ్యూనరేషన్...ఎంతో తెలుసా ?




 

వరస మూవీలతో బిజీ షెడ్యూల్ తో దూసుకపోతున్న బుట్ట బొమ్మ పూజా హెగ్డే తీసుకుంటున్న రెమ్యూనరేషన్ నయనతార కన్నా ఎక్కువట. ఇప్పటి వరకు 4 కోట్ల రెమ్యూనరేషన్ తో సౌత్ ఇండియా హీరోయిన్లలో నయన తార ముందువరసలో ఉంటే కీర్తి సురేష్ రెండవ స్థానం, రష్మిక మందన మూడవ స్థానంలో ఉన్నారు. అయితే బుట్ట బొమ్మ ఈ స్తానాలను మార్చేసింది.

హిందీ, తెలుగు, తమిళ మూవీలు చేస్తూ దూసుకపోతున్న పూజా హెగ్డే ప్రస్తుతం పాన్ ఇండియా మూవీ రాధేశ్యామ్ లో ప్రభాస్ కు జోడీగా, ఆచార్యలో రాంచరణ్ కు జంటగా నటిస్తోంది. వీటితో పాటు పూజా తమిళ స్టార్ ఇళయదళపతి విజయ్ హీరోగా వస్తున్న బీస్ట్ మూవీలో హీరోయిన్ గా చేస్తోంది. అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ మూవీని సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ నిర్మిస్తున్నారు. ఈ మూవీ కోసం పూజా హెగ్డే 5 కోట్ల‌ రెమ్యూనరేషన్ తీసుకుందట. 


 


Latest News
more

Trending
more