సెంచరీ దాటేసిన పెట్రోల్ ధర‌




పెట్రోల్ ధర ఎన్నడూ లేని స్థాయికి పైకెగిరింది. రోజు రోజుకు సామాన్యుడు అందుకోలేని ఎత్తులకు పోతోంది. పెట్రోల్ రేటు సెంచరీ మార్క్ ను దాటేసింది. పెట్రోల్ ఈ రేటుకు పెరగడం భారత దేశ చరిత్రలో ఇదే మొదటి సారి. రాజస్తాన్ గంగా నగర్ లో లీటర్ ప్రీమియం  పెట్రోల్ ధర ఈ రోజు 10.80 రూపాయలకు ఎగబాకింది. రాజస్తాన్ రాజధాని జైపూర్ లో లీటర్ సాధారణ పెట్రోల్ ధర 93.86 రూపాయలకు చేరింది. డీజిల్ ధర 85.94 రూపాయలు. దేశవ్యాప్తంగా ప్రతిరోజూ పెట్రోల్ ధరలు అనూహ్యంగా పెరుగుతున్నాయి. అయితే రాష్ట్రాల పన్నుల్లో తేడాల మూలంగా ఒక్కో రాష్ట్రంలో ధర ఒక్కో రకంగా ఉన్నది. హైదరాబాద్ లో ఈ రోజు లీటర్ సాధారణ పెట్రోల్ ధర 89రూపాయల 77 పైసలు కాగా డీజిల్ ధర 83 రూపాయల 46 పైసలు. అమరావతిలో లీటర్ సాధారణ పెట్రోల్ ధర 92 రూపాయల 54 పైసలు కాగా డీజిల్ ధర లీటర్ కు 85 రూపాయల 73 పైసలు. 


Latest News
more

Trending
more