పెరగనున్న ఉల్లి, ఆలుగడ్డ ధరలు
దేశంలో ఉల్లి, బంగాళదుంప ధరలు పెరిగే అవకాశముందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఉల్లి, ఆలుగడ్డ పంటల సాగు విస్తీర్ణం తగ్గడంతో రానున్న రోజుల్లో ధర మరింత పెరగనున్నట్లు వెల్లడించింది. వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ 2023–24వ సంవత్సరంలో ఉద్యాన పంటల ఉత్పత్తి గురించి నివేదిక విడుదల చేసింది. ఉల్లి ఉత్పత్తిలో 15 శాతం.. బంగాళదుంప ఉత్పత్తిలో 2 శాతం సాగు తగ్గిందని నివేదికలో పేర్కొంది.