త్రివిక్రమ్, నవీన్ పోలిశెట్టిల కాంబోలో మూవీ




ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ మూవీతో హిట్ కొట్టి, జాతి రత్నాలు మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన హీరో నవీన్ పోలిశెట్టి , మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో ఓ మూవీ రాబోతోంది. అయితే ఈ మూవీకి త్రివిక్రమ్ డైరెక్టర్ కాదు. ఆయన ఈ మూవీకి నిర్మాతగా వ్యవహరించనున్నాడు. ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్ మెంట్ , త్రివిక్రమ్ స్వంత బ్యానర్  ఫార్చ్యూన్ 4 సినిమాస్ తో కలిసి ఈ మూవీని నిర్మిస్తుంది. కళ్యాణ్ శంకర్ అనే నూతన డైరెక్టర్ ఈ మూవీతో పరిచయమవుతున్నాడు. 


ఇంకా టైటిల్ ఖరారు చేయని ఈ సినిమాకు సంబంధించి ఈ రోజు ఓ వీడియో రిలీజ్ చేశారు. ఈ మూవీ త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. మంచి నటుడిగా పేరు తెచ్చుకున్న నవీన్ పోలిశెట్టి, త్రివిక్రమ్ కాంబోలో మూవీ రానుండటంతో ఆ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీ బలమైన కథాంశంతో వస్తోందని సమాచారం.


Latest News
more

Trending
more