ఘనంగా ఎమ్మెల్సీ కవిత జన్మదిన వేడుకలు




ఘనంగా ఎమ్మెల్సీ కవిత జన్మదిన వేడుకలు

అక్షర విజేత, నిజామాబాద్ సిటీ : నగరంలోని జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో బుదవారం ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జన్మదినాన్ని ఘనంగా నిర్వహించారు. నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసి జన్మదిన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మేయర్ దండు నీతూ కిరణ్ మాట్లాడుతూ నిజామాబాద్ మాజీ పార్లమెంట్ సభ్యురాలు, ఎమ్మెల్సీ కవిత జిల్లా అభివృద్దికి ఎంతో కృషిచేశారని ఆమె గుర్తు చేశారు. ఆమె నిండు నూరేళ్లు ఆయో ఆరోగ్యలతో ఉండాలని, భవిషత్తులో మరిన్ని ఉన్నత పదవులు అదిరోహించాలని ఆమె ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఎస్.ఎ అలీం, నగర్ అధ్యక్షులు సిర్ప రాజు, సుజిత్ సింగ్, సుదాం రవిచందర్, ఎనగందుల మురళి, గాండ్ల లింగం, ప్యాట సంతోష్, చింతకాయల రాజు, యెండల ప్రసాద్, కరిపే రాజు, బిల్లా మహేష్, మధు, నరేష్, కృష్ణ రెడ్డి, అబ్దుల్ భారీ తదితరులు పాల్గొన్నారు.

భారత్ జాగృతి ఆధ్వర్యంలో...

భారత్ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జన్మదినోత్సవంను పురస్కరించుకొని నిజామాబాద్ జిల్లా భారత్ జాగృతి ఆధ్వర్యంలో నగరంలోని కంఠేశ్వర్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే ఎమ్మెల్సీ కవిత క్యాంపు కార్యాలయంలో కేక్ కట్టింగ్ చేసారు. స్నేహా సొసైటీలో పండ్ల పంపిణి చేసారు. ఈ కార్యక్రమంలో జాగృతి జిల్లా  నాయకులు అవంతి రావు మాట్లాడుతూ జాగృతితో తెలంగాణ జాతిని జాగృతం చేసి, బతుకమ్మను ప్రపంచవ్యాప్తం చేసిన ధీరవనిత భారత జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు లక్ష్మినారాయణ భరద్వాజ, అపర్ణ, రాజన్న, దేవేందర్, డాక్టర్ పులిజైపల్, కుల్దీప్, పంచరెడ్డి మురళి, సుకుమార్, సాయికృష్ణ, తెలంగాణ శంకర్, శోభ, తేలు సరిత, ఆకాష్, సందీప్, రంజిత్, దామోదర్, సరిత, హరీష్ తదితరులు పాల్గొన్నారు.
 


Latest News
more

Trending
more