అభివృద్ధి పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే నంబూరు శంకరరావు
అభివృద్ధి పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే నంబూరు శంకరరావు
అక్షర విజేత,పల్నాడు బ్యూరో:
పల్నాడు జిల్లా,పెదకూరపాడు నియోజకవర్గం అమరావతి మండలంలో లేమల్లె, కర్లపూడి గ్రామాల్లో నూతనంగా నిర్మించిన 10 కోట్లతో నిర్మించిన కోల్డ్ స్టోరేజ్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించిన పెదకూరపాడు శాసనసభ్యుడు నంబూరు శంకరరావు,గుంటూరు జిల్లా కేంద్ర సహకార బ్యాంకు చైర్మన్ రాతంశెట్టి సీతారామాంజనేయులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సహకార సంఘంల సలహాదారుడు బత్తుల బ్రహ్మానంద రెడ్డి.అనంతరం మండేపూడి గ్రామంలో నరుకుళ్ళపాడు ప్రాథమిక వ్యవసాయం సహకార పరపతి సంఘం సహకారంతో నూతనంగా నిర్మించిన 44 లక్షలతో బహుళ ప్రయోజన సౌకర్య గోదాము,1 కోటి 20 లక్షల రూపాయలతో రైతు విజ్ఞాన వేదిక,కళ్యాణ మండపము,పెదకూరపాడు మండలం బలుసుపాడు గ్రామంలో జలజీవన్ మిషన్ 35.90 లక్షల నిధులతో శంకుస్థాపన చేసి, మాజీ సర్పంచ్ అంబటి వీరయ్య విగ్రహాన్ని ఆవిష్కరించి, జగనన్న ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు ఎమ్మెల్యే నంబూరు శంకరరావు.