MAA Elections: విందు రాజకీయాలు ప్రారంభం




టాలీవుడ్ లో విందు రాజకీయాలు ప్రారంభమయ్యాయి. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ MAAఎన్నికల నేపథ్యంలో ఈ విందురాజకీయాలు మొదలయ్యాయి. అక్టోబర్ 10 న జరగనున్న ఈ ఎన్నికల కోసం ముందుగా ప్రకాష్ రాజ్ తన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఆదివారం ఉదయం నుండే ఆయన తన టీంతో కలిసి మూవీ ఆర్టిస్టులున్న ప్రాంతాల్లో ప్రచారం చేశారు. ఈ రోజు సాయంత్రం ఆయన ఓ ప్రముఖ హోటల్ లో సినీ ఆర్టిస్టులకు విందు ఇవ్వనున్నారు. 

ఇంతకు ముందే ప్రస్తుత MAA అధ్యక్షుడు నరేష్ ఆర్టిస్టులకు విందు ఇచ్చారు. ఇక ఈ రోజు ప్రకాష్ రాజ్ ప్రారంభించిన విందుతో రాజకీయాలు హీటెక్కనున్నాయి. మరో వైపు ప్రకాష్ రాజ్ కు పోటీగా అధ్యక్షుడిగా నిలబడుతున్న మంచు విష్ణు మాత్రం ఇప్పటి వరకు ప్రచారం మొదలు పెట్టలేదు. ఇంకా ఆయన ప్యానెల్ కూడా సెట్ కాలేదు. 

అధ్యక్షులుగా పోటీ చేస్తామని ముందుగానే ప్రకటించిన జీవిత, హేమలు తమ ఆలోచనను మార్చుకొని ప్రకాష్ రాజ్ ప్యానెల్ లో చేరిపోవడంతో ఇప్పుడు ప్రకాష్ రాజ్, మంచు విష్ణు ప్యానెల్ మద్య ముఖా ముఖి పోరు జరిగే అవకాశం ఉంది. ప్రకాష్ రాజ్ కు మెగా ఫ్యామిలీ మద్దతు ఉండగా మంచు విష్ణుకు మంచు ఫ్యామిలీతో పాటు నందమూరి బాలకృష్ణ మద్దతు కూడా ఉందనే ప్రచారం జరుగుతుంది. 

కాగా ఇలా విందులు ఇవ్వడాన్ని నిర్మాత, నటుడు బండ్ల గణేష్ ఖండించారు. విందు రాజకీయాలతో ఆర్టిస్టుల ప్రాణాలమీదికి తేకండి అంటూ ఆయన ఓ వీడియో రిలీజ్ చేశారు. విందులు బంద్ చేయండి అంటూ ఆయన MAA ఎన్నికల్లో పోటీ చేస్తున్న వారికి విఙప్తి చేశారు. 


Latest News
more

Trending
more