నిలకడగా ఉన్న సాయిధరమ్ ఆరోగ్యం
మెగా హీరో సాయి ధరమ్ తేజ్ ఆరోగ్య నిలకడగా ఉందని అపోలో డాక్టర్లు ప్రకటించారు. ఆయన ఇప్పటికీ వెంటిలేటర్ పైనే ఉన్నారని, ఐసీయూలో చికిత్స కొనసాగుతుందని డాక్టర్లు కొద్ది సేపటి క్రితం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో పేర్కొన్నారు. సాయి ధరమ్ ప్రధాన అవయాలకు ఎలాంటి హాని జరగలేదని అవయవాలన్ని బాగా పని చేస్తున్నాయని, ఈ రోజు మరిన్ని పరీక్షలు జరపాల్సిన అవసరం ఉందని డాక్టర్లు తెలిపారు. పరీక్షల తర్వాత రేపు మరో హెల్త్ బులెటిన్ రిలీజ్ చేస్తామని డాక్టర్లు చెప్పారు.
మరో వైపు సాయి ధరమ్ తేజ్ కు ప్రమాదం జరిగిందన్న వార్త టాలీవుడ్ ను ధిగ్భ్రాంతికి గురి చేసింది. సినీ ప్రముఖులంతా అపోలీ ఆస్పత్రికి వస్తున్నారు. రాత్రి నుండే మెగా ఫ్యామిలీ మొత్తం ఆస్పత్రిలోనే ఉంది. ఈ రోజు ప్రకాష్రాజ్, శ్రీకాంత్ తదైతరులు అపోలో ఆస్పత్రికి వచ్చారు. సాయి ధరమ్ త్వరగా కోలుకుంటారన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు ప్రకాష్ రాజ్.