ఐసీసీ ర్యాంకి‍ంగుల ప్రకటన - మొదటి రెండు స్థానాల్లో కోహ్లీ, రోహిత్




ఐసీసీ తాజాగా వన్డే రాంకింగులు ప్రకటించింది.  బ్యాట్స్‌మెన్లలో  భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ తన మొదటి స్థానాన్ని నిలబెట్టుకోగా సీనియర్ బ్యాట్స్‌మన్ రోహిత్ శర్మ రెండవ స్థానాన్ని  నిలబెట్టుకున్నాడు. బౌలర్ల జాబితాలో పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా మూడో స్థానంలో నిలిచాడు.

బ్యాట్స్‌మెన్‌ల జాబితాలో పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజం మూడవ స్థానంలో, న్యూజిలాండ్‌కు చెందిన రాస్ టేలర్ నాల్గవ స్థానంలో ఆస్ట్రేలియా కెప్టెన్ ఆరోన్ ఫించ్ ఐదవ స్థానంలో నిలిచారు. 

బౌలర్లలో న్యూజిలాండ్ పేసర్ ట్రెంట్ బౌల్ట్ మొదటి స్థానంలో,  ఆఫ్ఘన్ స్పిన్నర్ ముజీబ్ ఉర్ రెహ్మాన్ రెండవ స్థానంలో ఇండియన్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా మూడో స్థానంలో నిలిచారు. 
వెస్టిండీస్‌తో ఇటీవల ముగిసిన సిరీస్‌లో అత్యంత విజయవంతమైన బౌలర్‌గా నిలిచిన బంగ్లాదేశ్ స్పిన్నర్ మెహిడీ హసన్ మిరాజ్ ఏడు వికెట్లు పడగొట్టడంతో  నాలుగో స్థానంలో నిలిచాడు


Latest News
more

Trending
more