సాయి ధరమ్ తేజ్ ను రక్షించిన వ్యక్తికి కారు గిఫ్ట్ ఇచ్చారా ?
మెగా హీరో సాయి ధరమ్ తేజ్ బైక్ ప్రమాదానికి గురైనప్పుడు అతన్ని కాపాడిన వ్యక్తి మహ్మద్ ఫర్హాన్. అతని బైక్ పోతుండగా సాయి ధరమ్ తేజ్ బైక్ నుంచి పడి పోవడం చూసు బైక్ ఆపి. అతనిని లేపి నీళ్ళు తాగించి అంబులెన్స్ కు ఫోన్ చేసి అతన్ని ఆస్పత్రిలో చేర్చిన మహ్మద్ ఫర్హాన్ పై అభినందనల వర్షం కురుస్తోంది. అయితే కొందరు లేని వార్తలు సృష్టిస్తూ అతన్ని అతని కుటుంబాన్ని ఇబ్బందులపాలు చేస్తున్నారని ఫర్హాన్ వాపోతున్నాడు.
సాయి ధరమ్ తేజ్ ను రక్షించిన ఫర్హాన్ కు రాంచరణ్ ఓ కారి గిఫ్ట్ ఇచ్చాడని సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం జరిగింది. మెగా ఫ్యామిలీ అతనికి అనేక నజరానాలు ఇచ్చిందని కూడా వార్తలు ప్రచారం చేశారు కొందరు. దీనిపై స్పందిచిన మహ్మద్ ఫర్హాన్ ఈ ప్రచారాలను ఖండించాడు. మెగా ఫ్యామిలీలోని ఏ ఒక్కరూ తనకు ఎటువంటు బహుమతులు ఇవ్వలేదని, తనకెవ్వరూ ఫోన్ చేయలేదని ఆయన స్పష్టం చేశారు. తనపై జరుగుతున్న అసత్య ప్రచారాలపై ఆయన రాయదుర్గం పోలీసు స్టేషన్ లో పిర్యాదు చేశాడు.
తాను సాటి మనిషిగా ప్రవర్తించానని, ఏదో ఆశించి సహాయం చేయలేదని ఫర్హాన్ అన్నాడు. అసలు తాను రక్షించినప్పౌడు అతను హీరో అని, అతని పేరు సాయి ధరమ్ తేజ్ అని తనకు తెలియదని ఫర్మాన్ చెప్పాడు. సోషల్ మీడియాలో వస్తున్న వార్తలతో తన కుటుంబం ఇబ్బందులో పడుతుందని, దయచేసి అలాంటి తప్పుడు సమాచారం షేర్ చేయవద్దని ఫర్హాన్ విఙప్తి చేశాడు.