ఐపీఎల్ షెడ్యూల్ ను విడుదల చేసిన బీసీసీఐ
బీసీసీఐ ఐపీఎల్-14 షెడ్యూల్ ను విడుదల చేసింది. ఏప్రిల్ 9న ఐపీఎల్-21 ప్రారంభం కానుంది. తొలి మ్యాచులో ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడనున్నాయి. తొలి మ్యాచ్ చెన్నై వేదికగా జరగనుంది. మొత్తం 56 లీగ్ మ్యాచులు జరగనున్నాయి. ఫైనల్ మ్యాచ్ మే 30న జరగనుంది. మధ్యాహ్నం మ్యాచులు 3:30 గంటలకు స్టార్ట్ కానున్నాయి. డే & నైట్ మ్యాచులు 7:30 గంటలకు ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 9 నుంచి ఏప్రిల్ 17 వరకు ప్రతిరోజు ఒకే ఒక మ్యాచును నిర్వహించనున్నారు. ఏప్రిల్ 18 ఆదివారం రెండు మ్యాచులు జరగనున్నాయి. ఏప్రిల్ 21 బుధవారం రెండు మ్యాచులను నిర్వహిస్తున్నట్లు బీసీసీఐ ప్రకటించింది.
ఏప్రిల్ 25, ఏప్రిల్ 29, మే 2న రెండేసి మ్యాచులు జరగనున్నాయి. పలు రాష్ట్రాల క్రికెట్ బోర్డులు విజ్ఞప్తి చేసినా కరోనా మార్గదర్శకాలను పరిగణనలోకి తీసుకున్న బీసీసీఐ కేవలం 6 నగరాలనే ఎంపిక చేసింది. ఈ సీజన్ లో మ్యాచులు ఆరు నగరాలలో జరగనున్నాయి. అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, ముంబై, కోలకతా నగరాలలో ఈ మ్యాచులను నిర్వహించనున్నారు. కొత్తగా నిర్మించిన నరేంద్ర మోడీ స్టేడియంలో ప్లే ఆఫ్ మ్యాచులు, ఫైనల్స్ జరగనున్నాయి.