ఇందిరమ్మ అభయం పథకం, ప్రతి నెల మహిళలకు రూ.5 వేలు
ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు చేపట్టిన వైఎస్ఆర్ షర్మిల (YS Sharmila)...క్షేత్ర స్థాయి పర్యటనలతో ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. కొండపల్లిలో పర్యటించిన ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల... ఇందిరమ్మ అభయం పథకం (Indiramma Abhayam scheme) యాప్ లాంఛ్ చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రాష్ట్రంలోని పేద ఆడబిడ్డలకు ప్రతి నెల 5 వేల రూపాయలు ఇస్తామని వైఎస్ షర్మిల తెలిపారు. ఈ సందర్భంగా అర్హులైన కొంతమంది మహిళల వివరాలను ఇందిరమ్మ అభయం యాప్ లో పొందుపర్చారు షర్మిల. అర్హులైన ప్రతి మహిళ వివరాలు ఈ యాప్ ద్వారా సేకరిస్తున్నామన్నారు. ఈ పథకం అమలు కావాంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలన్నారు. పేద కుటుంబాలకు అండగా ఉండాలని కాంగ్రెస్ పార్టీ ఈ పథకాన్ని ప్రారంభించిందన్నారు.