టీ20 వరల్డ్ కప్ టీంను ప్రకటించిన బీసీసీఐ




2021  టీ20 వరల్డ్ కప్ టీం ను ప్రకటించింది బీసీసీఐ. యుఎఇ,  ఒమన్ లలో అక్టోబర్ 17 నుండి టీ20 వరల్డ్ కప్ జరగనుంది. 
భారత జట్టుకు విరాట్ కోహ్లీ కెప్టెన్ గా రోహిత్ శర్మ వైస్ కెప్టెన్ గా వ్యవహరించనున్నారు. KL రాహుల్, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్ (wk), ఇషాన్ కిషన్ (wk), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, రాహుల్ చాహర్, రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్, మొహమ్మద్ షమీలతో కూడిన జట్టును ఈ రోజు బిసిసిఐ కార్యదర్శి జయ్ షా బుధవారం (సెప్టెంబర్ 8) ప్రకటించారు. భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ కూడా ఈ టోర్నమెంట్‌కు మెంటర్‌గా భారత జట్టుతో ఉంటారు. స్టాండ్‌బై ప్లేయర్స్ గా శ్రేయాస్ అయ్యర్, శార్దూల ఠాకూర్, దీపక్ చాహర్ లు ఉంటారు.


యుఎఇ లో ఉన్న పిచ్ లు ఎక్కువగా స్పిన్ కు అనుకూలంగా ఉండటం వల్ల జట్టు కూర్పులో స్పిన్నర్లకే పెద్దపీట్ అవేసినట్టు కనిపిస్తోంది. అందువల్లేనే అశ్విన్ ను జట్టులోకి తీసుకున్నారు. 

జట్టులో తప్పకుండా స్థానం పొందుతారనుకున్న ఇటీవల శ్రీలంకలో పరిమిత ఓవర్ల జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన శిఖర్ ధావన్ తో సహా  పృథ్వీ షా, చాహల్, కుల్ దీప్ యాదవ్ లకు ఈ జట్టులో స్థానం లభించలేదు. 


Latest News
more

Trending
more