‘మొగుళ్లు ‘మోదీ’ భజన చేస్తుంటే.. భోజనం పెట్టకండి’- కేజ్రీవాల్
మోదీ భజన చేసే భర్తలకు రాత్రిళ్లు భోజనం పెట్టొద్దని మహిళలతో అన్నారు దిల్లీ సీఎం కేజ్రీవాల్. తనకు ఓటు వేయాలని పిలుపునిచ్చారు. భర్తలు.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భజన చేస్తుంటే.. వారికి భోజనం పెట్టొద్దని మహిళలకు పిలుపునిచ్చారు దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్. ఈ మేరకు.. మహిళా ఓటర్లతో జరిగిన సమావేశంలో వ్యాఖ్యానించారు. చాలా మంది పురుషులు.. పీఎం మోదీ పేరు జపిస్తున్నారు. మీరు దానిని కరెక్ట్గా సెట్ చేయాలి. మోదీ భజన చేస్తే.. భర్తలకు రాత్రి భోజనం పెట్టకండి," అని.. దిల్లీలో జరిగిన మహిళా సమ్మాన్ సమారోహ్ టౌన్హాల్ ఈవెంట్లో కేజ్రీవాల్ అన్నారు.
దిల్లీ బడ్జెట్లో భాగంగా ఇటీవలే ఓ కీలక ప్రకటన చేసింది ఆమ్ ఆద్మీ ప్రభుత్వం. 18ఏళ్లు పైబడిన మహిళలకు నెలకు రూ. 1000 ఇస్తున్నట్టు వెల్లడించింది. దాని పేరు.. 'ముఖ్యమంత్రి మహిళా సమ్మాన్ యోజన'. ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకే ఈ టౌన్హాల్ ఈవెంట్ని నిర్వహించారు అరవింద్ కేజ్రీవాల్.
"మీ కుటుంబసభ్యులు అరవింద్ కేజ్రీవాల్కి, ఆమ్ ఆద్మీకి మద్దతు ఇచ్చేలా.. వారి నుంచి మీరు ప్రతిజ్ఞ తీసుకోండి," అని దిల్లీ ముఖ్యమంత్రి అన్నారు.
2024 Lok Sabha elections : "విద్యుత్ని నేను ఉచితంగా ఇస్తున్నానని కుటుంబ సభ్యులకు చెప్పండి. బస్ టికెట్లను నేను ఫ్రీగా ఇస్తున్నాను. ఇక ఇప్పుడు.. ప్రతి నెల మహిళలకు రూ. 1000 ఇస్తున్నాను. బీజేపీ ఏం చేసింది? బీజేపీకి ఎందుకు ఓటు వేయాలి? ఈసారి కేజ్రీవాల్కి ఓటు వేయండి," అని ఆమ్ ఆద్మీ సుప్రీమో తెలిపారు.