సాయి ధరమ్ కు ప్రమాదం: సినీ ప్రముఖుల మధ్య మాట‌ల యుద్దం




మెగా హీరో సాయి ధరమ్ తేజ్ కు జరిగిన ఆక్సిడెంట్ సినీ పరిశ్రమలోని పలువురు ప్రముఖుల మధ్య రచ్చకు కారణమయ్యింది. హైదరాబాద్ లో స్పోర్ట్స్ బైక్ పై స్పీడ్ గా వెళ్తూ స్కిడ్ అయ్యి పడి పోయిన సాయి ధరమ్ తేజ్ అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయిన సంగతి తెలిసిందే. ముందుగా మెడి కవర్ హాస్పటల్, ఆ అత్ర్వాత్ ఆపోలో హాస్పటల్ లో చికిత్స పొందుతున్న ధరమ్ తేజ్ కోలుకోవాలని  తెలుగు సినీ పరిశ్రమ మొత్తం కోరుకుంటున్నది. ఈ నేపథ్యంలో సీనియర్ నటుడు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు నరేష్ మాట్లాడిన మాటలు వివాదానికి కారణమయ్యాయి. ఆయన మాటలపై నిర్మాత , నటుడు బండ్ల గణేష్, మరో నటుడు శ్రీకాంత్ విరుచుక పడ్డారు.

తన కుమారుడు నవీన్, సాయిధరమ్ ఇద్దరూ మంచి స్నేహితులని, ఇద్దరూ కలిసి బైక్ రేసింగ్ లు చేస్తారని, నిన్న కూడా ఇద్దరు కలిసే బైక్ లపై బైటికి వెళ్ళారని చెప్పిన నరేష్ బైక్ స్పీడ్ గా నడపకుండా వాళ్ళకు కౌన్సిలింగ్ చేయాలని కూడా అనుకున్నానని అన్నాడు నరేష్. పైగా బైక్ లు స్పీడ్ గా నడిపి చనిపోయిన వాళ్ళ గురించి కూడా మాట్లాడిన నరేష్ అలా బైక్ లు నడిపి తల్లింతండ్రులకు శోఖం మిగల్చ‌వద్దని కోరాడు.

ఇప్పుడు నరేష్ మాట్లాడిన మాటలే వివాదంగా మారాయి. నరేష్ అలా మాట్లాడటం పట్ల బండ్ల గణేష్, శ్రీకాంత్ లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సమయంలో రాజకీయాలు చేయడం సరైంది కాదు అనే టైటిల్ తో బండ్ల గణేష్ ఓ వీడియో ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. ''నరేష్ గారూ, ఇలాంటి సమయంలో సాయి తేజ్ కోలుకోవాలని ప్రార్దించాలి కానీ ఇలా రేసుల్లో పాల్గొంటాడు అంటూ ఏదేదో మాట్లాడటం మంచిది కాదు'' అని ఆ వీడియోలో గణేష్ అన్నాడు. 

మరో నటుడు శ్రీకాంత్ కూడా రేష్ మాట్లాడిన తీరుపై అసంత్రుప్తి వ్యక్తం చేశాడు. ''ఇలాంటి వీడియోలు పెట్టే ముందు ఎవరైనా కొంచెం ఆలోచించండి. సాయి ధరమ్ తేజ్ చాలా మెచ్చూర్డ్ పర్సన్. అతను ర్యాష్ డ్రైవింగ్ చేయడు. అతను ర్యాష్ మనిషి కాదు. అటువంటి వ్యక్తి గురించి ఇలాంటి సమయంలో ఇలా మాట్లాడటం సరైంది కాదు. కుటుంబ సభ్యులు ఎంతో టెన్షన్ లో ఉన్నారు. ఇలాంటి టైంలో కుటుంబాన్ని మరింత టెన్షన్ కు గురి చేయవద్దు. ఈ టైంలో చనిపోయిన వారి గురించి మాట్లాడకుండా ఉంటే మంచిది. నరేష్ గారు అలా మాట్లాడకుండా ఉండాల్సింది'' అని శ్రీకాంత్ ఓ వీడియో పోస్ట్ చేశాడు. 


Latest News
more

Trending
more