ఐదవ శక్తిపీఠం జోగులాంబ అమ్మ వారి దర్శించుకున్న ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీ, ఎమ్మెల్సీ అభ్యర్థి దంపతులు




ఐదవ శక్తిపీఠం 
జోగులాంబ అమ్మ వారి దర్శించుకున్న ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీ, ఎమ్మెల్సీ అభ్యర్థి దంపతులు

అక్షరవిజేత గద్వాలబ్యూరో:

జోగులాంబ గద్వాల జిల్లా  బాల బ్రహ్మేశ్వరి దేవి అమ్మవారిని దర్శనానికి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ఎమ్మెల్సీ అభ్యర్థి నవీన్ కుమార్ రెడ్డి దంపతులు, గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి , అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు , ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి అలంపూర్ నియోజకవర్గం ఐదవ శక్తిపీఠం జోగులాంబ దేవాలయంలో బాల బ్రహ్మేశ్వరి దేవి అమ్మ ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి ఆశీర్వాదం పొందడం జరిగింది.
వేద పండితులు ఎమ్మెల్సీ అభ్యర్థి దంపతులకు, ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీకి పూర్ణకుంభం కు స్వాగతం పలికారు
అమ్మవారిని దర్శించుకుని అనంతరం నేటి నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థి ఎన్నికల ప్రచారంలో జోగులాంబ అమ్మ ఆశీస్సులతో ప్రారంభించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ఎంపీపీలు విజయ్, రాజారెడ్డి, జిల్లా బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత గడ్డం కృష్ణారెడ్డి, ఆలయ కమిటీ చైర్మన్ బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
 


Latest News
more

Trending
more