క్రికెట్ స్టేడియంలోకి ప్రేక్షకుల అనుమతి : బీసీసీఐ




కరోనా మహమ్మారి కారణంగా క్రీడలన్నీ స్తంభించిపోయాయి. ఇండియాలో అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ జరుగక దాదాపు ఏడాది కావొస్తున్నది. అయితే ఈ నెల 5 నుంచి చెన్నైలో ఇండియా, ఇంగ్లాండ్ మధ్య తొలి టెస్టు ప్రారంభం కానున్నది. అయితే ఈ టెస్టుకు ప్రేక్షకులను అనుమతించకూడదని బీసీసీఐ నిర్ణయించింది.

కాగా, క్రికెట్ స్టేడియంలోకి ప్రేక్షకులను అనుమతించవచ్చని తమిళనాడు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ ఉత్తర్వలు సోమవారమే వెలువడ్డాయి. నాలుగు రోజుల్లో టికెట్ల ముద్రణ, సీట్ల ఏర్పాటు కష్టమని తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ చెబుతున్నది. అందుకే తొలి టెస్టుకు ప్రేక్షకులను అనుమతించడం లేదని స్పష్టం చేసింది.

ఫిబ్రవరి 13 నుంచి జరిగే రెండో టెస్టుకు మాత్రం చేపాక్ స్టేడియంలో అనుమతి ఉంటుందని స్పష్టం చేసింది. మరోవైపు మొతేరా స్టేడియంలో జరిగే టీ20 మ్యాచ్‌లకు ప్రేక్షకులు రావొచ్చని గుజరాత్ క్రికెట్ అసోసియేషన్ ఇప్పటికే చెప్పింది.


Latest News
more

Trending
more