టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్.. సిరాజ్కు దక్కని చోటు
ఇండియా పర్యటనకు వచ్చిన ఇంగ్లాండ్ జట్టు ఈ రోజు నుంచి తొలి టెస్టు ఆడనున్నది. చెన్నైలోని చేపాక్ స్టేడియంలో జరుగుతున్న తొలి టెస్టులో టాస్ గెల్చిన ఇంగ్లాండ్ జట్టు బ్యాటింగ్ చేయడానికి నిర్ణయించుకున్నది. తొలి రోజు పిచ్ బ్యాటింగ్కు అనుకూలించే అవకాశం ఉండటంతో కెప్టెన్ జో రూట్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పాడు.
మరోవైపు భారత జట్టులో మహ్మద్ సిరాజ్కు స్థానం లభించలేదు. ఆసీస్ పర్యటనలో రాణించిన సిరాస్ బదులు షాబాజ్ నదీమ్కు చోటు దక్కింది. అక్షర్ పటేల్ ఎడమ మోకాలి నొప్పితో తొలి టెస్టు నుంచి వైదొలగడంతో వాషింగ్టన్ సుందర్కు తుది జట్టులో స్థానం సంపాదించాడు.
ఇండియా :
రోహిత్ శర్మ, శుభమన్ గిల్, చతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, అజింక్య రహానే, రిషబ్ పంత్, వాషింగ్టన్ సుందర్, రవిచంద్రన్ అశ్విన్, షాహబాజ్ నదీమ్, ఇషాంత్ శర్మ, జస్ప్రిత్ బుమ్రా
ఇంగ్లాండ్ :
డామ్ సిబ్లీ, రోరీ బుర్న్స్, డాన్ లారెన్స్, జో రూట్, బెన్ స్టోక్స్, ఓలీ పోప్, జోస్ బట్లర్, డోమ్ బెస్, జోఫ్రా ఆర్చర్, జాక్ లీచ్, జేమ్స్ ఆండర్సన్