* చేవెళ్ల కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి గెలవడం ఖాయం
* చేవెళ్ల కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి గెలవడం ఖాయం
* వరంగల్ ఎంపీ టికెట్ పిడమర్తి రవికి కేటాయించాలి
* మాదిగ జేఏసీ జిల్లా అధ్యక్షుడు, కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఈదనోళ్ళ రాజు
అక్షరవిజేత, వికారాబాద్ ప్రతినిధి
చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గం లోని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలవడం ఖాయమని మాదిగ జేఏసీ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎదానోళ్ల రాజు పేర్కొన్నారు. గురువారం మాదిగ జేఏసీ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు, కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఈదానోళ్ల రాజు అక్షర విజేత వికారాబాద్ ప్రతినిధితో మాట్లాడుతూ, మాదిగ జేఏసీ వ్యవస్థాపకుడు, తెలంగాణ తొలి ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 17 ఎంపీ సీట్లలో 14 ఎంపీ సీట్లు గెలవడంలో పిడమర్తి రవి కీలకపాత్ర పోషిస్తాడని రాజు పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత మాదిగలకు 12 శాతం రిజర్వేషన్ తో పాటు ఏబిసిడి వర్గీకరణ సాధించడమే పిడమర్తి రవి లక్షమని రాజు పేర్కొన్నారు. వరంగల్ ఎంపీ టికెట్ మాదిగ జేఏసీ వ్యవస్థాపకుడు పిడమర్తి రవికి కేటాయించాలని, పిడమర్తి రవికి వరంగల్ టికెట్ కేటాయిస్తే గెలవడం ఖాయమని,పిడమర్తి రవికి వరంగల్ ఎంపీ టికెట్ కేటాయిస్తేనే మాదిగలకు న్యాయం చేసిన వారు అవుతారని అన్నారు.పిడమర్తి రవి సూచన మేరకు చేవెళ్ల కాంగ్రెస్ ఎంపీ గెలుపు లో మాదిగ జేఏసీ కీలకపాత్ర పోషిస్తుందని రాజు తెలిపారు.