ధర్పల్లి లో బిఆర్ఎస్ నాయకుల సంబరాలు.




ధర్పల్లి లో బిఆర్ఎస్ నాయకుల సంబరాలు.

-నిజామాబాద్ ఎంపీ టికెట్ బాజిరెడ్డి గోవర్ధన్ కు ఖరారు కావడంతో బిఆర్ఎస్ నాయకుల్లో ఉత్సాహం మొదలైంది.

-ఎంపీ ఎలక్షన్స్ బరిలో బాజిరెడ్డి గోవర్ధన్

-పోటా, పోటీగా కొనసాగనున్న ఎంపీ ఎలక్షన్స్


-సంతోషంలో బిఆర్ఎస్ నాయకులు


అక్షర,విజేత నిజామాబాద్ ప్రతినిధి:


ధర్పల్లి మండలంలో  బిఆర్ఎస్ మండల అధ్యక్షులు మహిపాల్ యాదవ్,ఆధ్వర్యంలో తోటి నాయకులతో కలిసి  టాపాసులు కాల్చి, మిఠాయిలు పంచి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా మహిపాల్ యాదవ్ మాట్లాడుతూ మొట్టమొదటిసారిగా నిజామాబాద్  ఎంపీ టికెట్ బాజిరెడ్డి గోవర్ధన్ కు ఖరారు చేసినందుకు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మరియు కేటీఆర్ కు ధర్పల్లి బి ఆర్ ఎస్ మండల శాఖ తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామని ఆయన అన్నారు.గత ఎన్నికలలో జరిగిన లోపాలను సరిదిద్దుకొని ప్రతి ఒక్క కార్యకర్త సైనికుడిలా పనిచేసి, బాజిరెడ్డి గోవర్ధన్ ను ఎంపీగా గెలిపించి, నిజామాబాద్ కు రావలసిన నిధుల కొరకు లోక్ సభలో తమ గళం వినిపించి, జిల్లాని అభివృద్ధి కి కృషి చేస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు ప్రతి ఒక్కరూ సమిష్టి కృషితో పని చేసి ఎంపీ గా బాజిరెడ్డి గోవర్ధన్ ను గెలిపించి కేసిఆర్ కు బహుమతిగా అందిస్తామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు మహిపాల్ యాదవ్, రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు రాజుపాల్ రెడ్డి, సొసైటీ చైర్మన్ చిన్నారెడ్డి,నాయకులు
రాజేష్ నాయక్, ధరావత్ గోపాల్, శంకర్ నాయక్, నజీర్, మైపాల్, పోతరాజు, చెలిమెల రవి, కో ఆప్షన్ మెంబర్ అబ్దుల్ మజీద్, చెలిమెల రంజిత్, సురేందర్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.
 


Latest News
more

Trending
more