తొలి టెస్టు ఆడుతున్న బుమ్రా




టీమ్ ఇండియా పేసర్ జస్ప్రిత్ బుమ్రా చెన్నైలో తొలి టెస్టు ఆడుతున్నాడు. అదేంటీ.. బుమ్రా ఇప్పటికే చాలా టెస్టులు ఆడాడు కదా.? మరి తొలి టెస్టు అంటారేమిటని డౌట్ వచ్చిందా? అసలు విషయం ఏంటంటే జస్ప్రిత్ బుమ్రా 2018లో దక్షిణాఫ్రికాలో తొలి టెస్టు ఆడాడు. అప్పటి నుంచి బుమ్రా మొత్తం 17 టెస్టులు ఆడాడు.

కాగా, ఆ టెస్టులన్నీ విదేశాల్లోనే ఆడటం గమనార్హం. ఇంత వరకు బుమ్రా స్వదేశంలో ఒక్క టెస్టు మ్యాచ్ కూడా ఆడలేదు. చెన్నైలో ఇంగ్లాండ్‌తో జరుగుతున్న మ్యాచే బుమ్రాకు తొలి టెస్టు. ఇప్పటి వరకు 17 మ్యాచ్‌లలో 21.59 సగటుతో 79 వికెట్లు తీశాడు. ఇవన్నీ విదేశాల్లోనే కావడం గమనార్హం. అయితే 17 టెస్టులు ఆడినా ఇంత వరకు స్వదేశంలో మ్యాచ్ ఆడని క్రికెటర్‌గా బుమ్రా సరికొత్త రికార్డు సృష్టించాడు. ఈ సందర్భంగా ఐసీసీ బుమ్రాకు ఆల్ ది బెస్ట్ చెప్పింది.

 

Latest News
more

Trending
more