పన్ను చెల్లింపుదారులూ ఆ పని పూర్తి చేశారా? ఇంకా 5 రోజులే ఉంది.. గడువు దాటితే బాదుడే!




ఇన్‌కమ్ ట్యాక్స్ చెల్లించే వారికి బిగ్ అలర్ట్. పన్ను చెల్లింపుదారుల్లో చాలా మంది అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. ఒక్కసారే కాకుండా విడతల వారీగా చెలిస్తుంటారు. అందుకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ (CBDT) అవకాశం కల్పిస్తోంది. ఈ ఆర్థిక ఏడాది 2023-24కి సంబంధించి నాలుగో విడత (చివరి విడత) అడ్వాన్స్ ట్యాక్స్ పేమెంట్ చేసేందుకు గడువు దగ్గర పడుతోంది. ఇంకా నాలుగు రోజులే ఉంది. మార్చి 15, 2024 లోపు నాలుగో విడత అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. ఇంకా ఎవరైనా పన్ను చెల్లింపుదారులు ఈ పని చేయకుంటే వెంటనే మీ అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లించండి. ఇప్పటికీ సీబీడీటీ సైతం అవగాహన కల్పిస్తోంది. ఈ క్రమంలో అడ్వాన్స్ ట్యాక్స్ ఏమిటి? ఎవరు కడుతుంటారు? ఆలస్యం చేస్తే పెనాల్టీలు ఎలా ఉంటాయి? అనేది తెలుసుకుందాం.

వచ్చే ఆర్థిక ఏడాది (అసెస్మెంట్ ఇయర్ 2024-25)కి సంబంధించిన ఆదాయాన్ని అంచనా వేసి ముందస్తుగా చెల్లించే ట్యాక్సులనే అడ్వాన్స్ ట్యాక్స్ అని అంటారు. ఈ అడ్వాన్స్ ట్యాక్సును ఒకేసారి కాకుండా దశల వారీగా చెల్లించాల్సి ఉంటుంది. అంచనా వేసి ఆదాయంపై చెల్లించాల్సిన ట్యాక్సులు రూ.10 వేలకు మించి ఉన్న ప్రతి ఒక్కరు ఈ అడ్వాన్స్ ట్యాక్స్ కట్టాల్సిందే. ఉద్యోగులు, వ్యాపారులతో పాటు స్వయం ఉపాధి పొందే వారు సైతం ఈ అడ్వాన్స్ ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది. అయితే, ఉద్యోగుల విషయంలో కంపెనీ యాజమాన్యాలే జీతం నుంచి టీడీఎస్ డిడక్ట్ చేస్తుంటాయి కాబట్టి వారు ప్రత్యేకంగా అడ్వాన్స్ ట్యాక్స్ కట్టనక్కర్లేదు. కానీ, ఒక వేళ ఇతర ఆదాయ మార్గాలు ఉండి పన్ను రూ.10 వేలు దాటినప్పుడు వారు సైతం ఈ నిబంధనలు పాటించాల్సి ఉంటుంది.

ఒక ఆర్థిక ఏడాదిలో తొలి విడత కింద జూన్ 15వ తేదీ నాటికి 15 శాతం పన్ను అడ్వాన్స్ గా చెల్లించాలి. ఆ తర్వాత సెప్టెంబర్ 15వ తేదీ నాటికి 45 శాతం ట్యాక్స్ కట్టాలి. ఆ తర్వాత మూడో విడత కింద డిసెంబర్ 15వ తేదీలోపు 75 శాతం పన్ను అడ్వాన్స్ గా చెల్లించాలి. అలాగే ఆర్థిక ఏడాది చివరి నాటికి అంటే మార్చి 15 లోపు నాలుగో విడతగా 100 శాతం అడ్వాన్స్ ట్యాక్స్ పేమెంట్ చేసేయాలి.
 


Latest News
more

Trending
more