ప్రభాస్ మూవీ ఆదిపురుష్ పై గాసిప్స్....క్లారిటీ ఇచ్చిన రావణుడు




పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరస సినిమాలతో దూసుకపోతున్నాడు. బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ ఓం రౌత్ నిర్మిస్తున్న 'ఆదిపురుష్' మూవీలో రాముడిగా నటిస్తున్నాడు ప్రభాస్. ఈ మూవీ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఈ మూవీలో సీతగా కృతి సనన్, రావణుడిగా సైఫ్ అలీ ఖాన్ లు నటిస్తున్నారు. అయితే ఈ మూవీకి సంబంధించి ఓ వార్త ఫ్యాన్స్ లో ఆందోళన కలిగిస్తోంది.

దేశంలో, ప్రపంచంలో కరోనా వైరస్ ఇంకా తగ్గలేదు. గతంలో కన్నా చాలా తగ్గినప్పటికీ రోజూ కేసులు వస్తూనే ఉన్నాయి. దాంతో థియేటర్లు పూర్తిగా ఇంకా తెర్చుకోలేదు. మరో వైపు మూడో వేవ్ భయం ప్రజలను భయపడుతూనే ఉన్నది. ఈ నేపథ్యంలో 'ఆదిపురుష్' మూవీని థియేటర్లలో కాకుండా ఓటీటీలో రిలీజ్ చేస్తారని వార్తలు వస్తున్నాయి. దాంతో ప్రభాస్ అభిమానులు అసంత్రుప్తి వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ వార్తలపై క్లారిటీ ఇచ్చారు 'ఆదిపురుష్' లో రావణ పాత్రధారి సైఫ్ అలీ ఖాన్. 

ఈమూవీని ఎట్టి పరిస్థితుల్లోనూ ఓటీటీలో రిలీజ్ చేసే అవకాశం లేదని ఇది ఖచ్చితంగా థియేటర్లలోనే రిలీజ్ అవుతుందని సైఫ్ అలీ ఖాన్ అన్నారు. ఇంత గొప్ప మూవి పెద్ద తెర మీద చూస్తేనే బాగుంటుందన్న సైఫ్ మేకర్స్ కూడా ఈ మూని థియేటర్లలో రిలీజ్ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసుంటున్నారని స్పష్టం చేశారు. రావణుడు ఇచ్చిన ఈ క్లారిటీతో ప్రభాస్ ఫ్యాన్స్ ఖుష్ అవుతున్నారు.


Latest News
more

Trending
more