బ్రేకింగ్ న్యూస్: మెగా నటుడు సాయి ధరమ్ తేజ్ కు ఆక్సిడెంట్




మెగా హీరో సాయి ధరమ్ తేజ్ కు తీవ్ర ప్రమాదం జరిగింది. మాదాపూర్ లోని కేబుల్ బ్రిడ్జ్ దాటాక ఐకియా కి వెళ్ళే దారిలో ఈ ప్రమాదం జరిగింది. 1150 సీసీ ఉన్న ట్రయాంఫ్  స్పోర్ట్స్ బైక్ పై వెళ్తుండగా బైక్ స్కిడ్ అయ్యి కింద పడి పోయాడు. వెంటనే అతను అపస్మారక స్థితిలోకి వెళ్ళాడు. ప్రమాదం జరిగిన నిమిషాల్లోనే అక్కడికి చేరుకున్న పోలీసులు అతన్ని వెంటనే దగ్గర్లోనే ఉన్న మెడికవర్ ఆస్పత్రికి తరలించారు. ఓవర్ స్పీడ్ వల్లనే ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. 

సాయిధరమ్ తేజ్ కు డాక్టర్లు చికిత్స అందిస్తున్నారు. అతని ప్రాణాలకు ప్రమాదమేమీ లేదని, షాక్ కు గురవడం వల్ల ధరమ్ తేజ్ స్పృహ కోల్పోయాడని డాక్టర్లు తెలిపారు. అతనికి చాతిపై, పొట్టపై, కన్నుపై గాయాలయ్యాయని డాక్టర్లు తెలిపారు. ఇవి బైటికి కనిపిస్తున్న గాయాలు మాత్రమే. స్కానింగ్ తీసిన తర్వాత శరీరం లోపల ఏమైనా గాయాలయ్యాయా అనేది తెలుస్తుంది. 

సమాచారం తెలిసిన వెంటనే చిరంజీవి, పవన్ కళ్యాణ్ తో సహా మెగా కుటుంబం మొత్తం ఆస్పత్రికి చేరుకున్నారు. ధరమ్ తేజ్ ను ఆస్పత్రిలో చూసి డాక్ట్రలతో సంప్రదింపులు జరిన తర్వాత పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడుతూ. ''ఇప్పటికీ అపస్మారక స్థితిలోనే ఉన్నాడు. వేరే ఆస్పత్రికి మారుస్తున్నాం. ఏ విషయం త్వరలోనే చెబుతాం '' అని చెప్పాడు.

మరో వైపు సాయు ధరమ్ తేజ్ కు ప్రమాదం జరిగిందన్న వార్త తెలిసిన మెగా ఫ్యాన్స్ మెడికవర్ ఆస్పత్రికి చేరుకుంటున్నారు. ఆస్పత్రి వద్ద పోలీసులు కూడా మోహరించారు. 

1030 స్కానింగ్ తీసిన తర్వాత డాక్టర్లు సాయిధరమ్ కు కాలర్ బోన్ (క్లావికల్ ఫ్రాక్చర్)  విరిగిందని తేల్చారు.
11.00pm సాయిధరమ్ తేజ్ ను మెడికవర్ ఆస్పత్రి నుంచి జూబ్లీ హిల్స్ అపోలో ఆస్పత్రికి తరలించారు.

11.58pm అల్లు అరవింద్ మీడియాతో మాట్లాడారు.... ''సాయి ధరమ్ తేజ్ సేఫ్ గా ఉన్నారు. పెద్ద గాయాలేమీ లేవు. రేపు పొద్దున కల్లా సాయి ధరమ్ మాట్లాడే పరిస్థితికి వస్తాడని డాక్టర్లు చెప్పారు.'' 
 


Latest News
more

Trending
more