
వార్డ్ మెంబర్ల కూడా నెలకు రూ 5వేలు వేతనం కేటాయించాలి
– వార్డ్ మెంబర్ల జిల్లా అధ్యక్షుడు పింగిలి వేణుగోపాల్ రెడ్డి
విజేత,తరిగొప్పుల / జనగామ: రాష్ట్ర అభివృద్ధి స్థాయిలో అత్యంత కీలకమైన వ్యవస్థ గ్రామపంచాయతీ వ్యవస్థ ఇట్టి వ్యవస్థలో ప్రజల చేత ప్రత్యక్షంగా ఎన్నుకోబడిన వార్డ్ మెంబర్ల కు నెలవారి కనీస వేతనం రూ 5వేలు కేటాయించాలని వార్డ్ మెంబర్ల జిల్లా అధ్యక్షుడు పింగిలి వేణుగోపాల్ రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.ప్రజా సేవలో తమ వంతు నిస్వార్ధంగా సేవ చేసుకుంటూ ప్రతి వార్డులో తమ సేవా కార్యక్రమాలు చేసుకుంటూ పోతుంటే కనీస విలువలు కూడా వార్డ్ మెంబర్ కి లేకుండా పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసిన వార్డ్ మెంబర్లు అందరికీ ఐదువేలు గౌరవ వేతనంగా అందించాలని ఎమ్మెల్యే,ఎంపీలకు ఏవిధంగా గౌరవ వేతనం ఉందో గ్రామాల్లో ఉన్న ప్రతి ఒక్క వార్డ్ మెంబర్ కు గౌరవేతనం అందించాలని డిమాండ్ చేశారు.రాబోయే రోజుల్లో జిల్లా వ్యాప్తంగా వార్డ్ మెంబర్లు అందరూ ఐక్యంగా ఉండి పోరాటం చేయాలని పిలుపునిచ్చారు.








