యోగను ప్రపంచానికి పరిచయం చేసింది భారతదేశమే

యోగను ప్రపంచానికి పరిచయం చేసింది భారతదేశమే

విజేత,చొప్పదండి:

జూన్ 21 అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా చొప్పదండి రూరల్ శాఖ ఆధ్వర్యంలో స్థానిక గిర్వాణి బీఈడీ కళాశాలలో యోగా కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి యోగ గురువు ఆచార్యసత్యనేని శ్రీనివాస్ హాజరై దిశానిర్దేశం చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యోగను ప్రపంచానికి పరిచయం చేసిన ఘనత భారతదేశానిదే అని అన్నారు.యోగ చేయడం వల్ల మనసు అదుపులో ఉంటుందని, ఆలోచనలుస్థిమితమవుతాయని తెలిపారు.ప్రతి ఒక్కరూ యోగాను నిత్య జీవితంలో అలవాటు చేసుకోవడం వల్ల ఆరోగ్యంమెరుగుపడుతుందన్నారు.ఆరోగ్యంగా ఉండడానికి ఏకైక మార్గం యోగ అని, శరీరాన్ని, మనసును,ఆత్మను ఏకం చేసే ఏకైక మార్గం యోగానేనని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో కిసాన్ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు సింగిరెడ్డి కృష్ణారెడ్డి,మండల అధ్యక్షులు మొగిలి మహేష్,మండల ప్రధాన కార్యదర్శి కొమ్మ రమేష్,మండల కార్యదర్శి ఐద మారుతి,మాజీ ఎంపీటీసీ తోట కోటేష్,దొంతి సారపు సంపత్,గుండె వెంకటేష్, సింగసాని రాములు,నెల్లి అనిల్, చీకట్ల ఆకాష్,సాయి వరుణ్ రెడ్డి, మల్యాల లక్ష్మణ్,బత్తిని సతీష్, సత్తు సంజీవ్,సిరిపురం శ్రీనివాస్, రాపల్లి శ్రీనివాస్,దిశాంత్ రెడ్డి, ఉమేష్,గుంట ఐలయ్య తదితరులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి :

తాజా వార్తలు చదవండి :