సిసి రోడ్డు పనులను ప్రారంభించిన సర్పంచ్

విజేత,వికారాబాద్ ప్రతినిధి : వికారాబాద్ జిల్లా పరిధిలోని ధారూర్ మండల కేంద్రంలో తెలంగాణ శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ సహకారంతో ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో గురువారం జిల్లా పరిషత్ పాఠశాల నుండి సిసి రోడ్డు పనులను గ్రామ సర్పంచ్ ప్రమీల గౌడ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వ సహకారంతో గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ జాంగిర్, కాంగ్రెస్ నాయకులు డిసిసి కార్యదర్శి బాబా ఖాన్, సీనియర్ నాయకులు బుజ్జయ్య గౌడ్, ఏఎంసీ డైరెక్టర్ పటేల్ అమరేశ్వర్, బోయినీ అంజయ్య, మాజీ ఉపసర్పంచ్ యూనిస్ ఇబ్రహీం, కాంగ్రెస్ పార్టీ టౌన్ అధ్యక్షులు మల్లేశం, టౌన్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎండి దావూద్,అశోక్, కిరణ్ కుమార్,సాయి,సంగమేశ్వర్, వార్డ్ మెంబర్లు శ్రీశైలం, శివకుమార్, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.