– ముద్దేంగూడ శివాలయంలో ప్రత్యేక పూజలు చేస్తున్న సజ్జల భువనేశ్వర్ కుటుంబ సభ్యులు
విజేత,రంగారెడ్డి : చేవెళ్ల నియోజకవర్గం,షాబాద్ మండలం,ముద్దేం గూడ, గ్రామ శివాలయంలో శ్రావణ మాసం సందర్భంగా,పురస్కరించుకొని మండల పరిధిలోని, ముద్దేం గూడ మల్లా రెడ్డి గూడ గ్రామాల శివారులో గల స్వయంభుగా వెలసిన,లింగమూర్తి ఆలయంలో సోమవారం గ్రామస్తులు,రుద్రాభిషేకం,బిల్వార్చన,ప్రత్యేక పూజలు నిర్వహించారు.రుద్రాభిషేకం అనంతరం శివుడికి ప్రత్యేక అలంకరణ చేశారు. ఆలయ ప్రాంగణం శివనామస్మరణతో మార్మోగింది.అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు.శ్రావణమాసంలో శివుడిని భక్తితో పూజిస్తే కుటుంబంలో,సుఖసంతోషాలు ఆయురారోగ్యాలు కలుగుతాయని, భక్తులు విశ్వసించారు.ఈ కార్యక్రమంలో ముద్దెంగూడ గ్రామ సర్పంచ్ పరివేద నర్సింలు ముదిరాజ్,మల్లారెడ్డి గూడ గ్రామ సర్పంచ్ సబిత గోవర్ధన్ రెడ్డి,ముద్దేం గూడ గ్రామ ఉపసర్పంచ్ సిద్దాపురం శివకుమార్,మాజీ సర్పంచ్ కొత్త కుర్వ జయమ్మ సుదర్శన్,సజ్జన భువనేశ్వర్,మహేశ్వర్, విశ్వేశ్వర్,జగదీశ్వర్, వెంకటయ్య,రఘునందన్ గౌడ్,మల్లికార్జున్,వెంకటయ్య గుప్తా, శ్రీనివాస్ గుప్తా, రాఘవేందర్ గుప్తా,భూపతి సురేష్,నానాజీపురం పురుషోత్తం, నర్సింలు,కూర సత్యనారాయణ,సిద్దాపురం నవీన్,మరియు తదితరులు పాల్గొన్నారు.