Logo
Date of Publish : 31 August 2026, 5:39 pm
Editor : B. Anil Kumar

మాణిక్యమ్మ చిత్రపటానికి నివాళులర్పించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు

విజేత, తల్లాడ ఖమ్మం బ్యూరో:  అన్నారుగూడెం గ్రామానికి చెందిన మగునూరి మాణిక్యమ్మ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. సోమవారం దశ దినకర్మ అన్నారుగూడెం గ్రామంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అన్నారుగూడెం గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు జిల్లా ప్రధాన కార్యదర్శి గోవింద్ శ్రీనివాసరావు, అన్నారుగూడెం గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తుమ్మలపల్లి రమేష్, అన్నారుగూడెం మాజీ విడిసి చైర్మన్ మారెళ్ళ మల్లికార్జునరావు మాజీ ఎంపీటీసీ తాళ్ల జోసెఫ్, గోపాలపేట కాంగ్రెస్ పార్టీ నాయకులు తాళ్ల వెంకటి హాజరై మాణిక్యమ్మ స్వగృహంలో ఆమె చిత్రపటానికి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. మాణిక్యమ్మ కుటుంబానికి అన్నివేళలా అండగా ఉంటామన్నారు. ఈ కార్యక్రమంలో వారి వెంట నాయకులు, కార్యకర్తలు, కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By www.aksharavijetha.com || www.epaper.aksharavijetha.com
Print Save
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • ఈ -పేపర్
  • Reporters Apply
  • Reporters
  • Login
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • ఈ -పేపర్
  • Reporters Apply
  • Reporters
  • Login

Designed By www.Webdigitalway.com
( 9052933264 )