మట్టిలో మాణిక్యాలను వెలికితీస్తాం
- సీఎం రేవంత్ రెడ్డి
విజేత,హైదరాబాద్ : అందరికీ నాణ్యమైన విద్య అందించేందుకు విద్యపై ఏటా రూ.27వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని సీఎం రేవంత్ తెలిపారు. 'ప్రభుత్వ పాఠశాలల్లో విద్యపై తల్లిదండ్రుల్లో అపోహలున్నాయి. వాటిలో చదవడాన్ని నామోషీగా భావిస్తుంటారు. దాన్ని తొలగించేందుకే తెలంగాణ పబ్లిక్ స్కూళ్లను ఏర్పాటు చేస్తున్నాం' అని ఆరుట్ల టి పి ఎస్ ప్రారంభోత్సవ సభలో వివరించారు. గవర్నమెంట్ స్కూళ్ల విద్య ద్వారా మట్టిలో మాణిక్యాలను వెలికితీస్తామని వ్యాఖ్యానించారు.మెస్సీని హైదరాబాద్ కు తీసుకొస్తే కొందరు విమర్శలు చేశారని సీఎం రేవంత్ మండిపడ్డారు. క్రీడాకారుల్లో స్ఫూర్తి నింపేందుకు తీసుకొచ్చినట్లు చెప్పారు. 'మెస్సీ డ్రగ్స్ ముఠా లీడర్ కాదు, ఆర్థిక నేరగాడు కాదు. గత ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ బీసీ, మైనార్టీ అంటూ కులానికో స్కూల్ పెట్టింది. కుల వ్యవస్థ నిర్మూలనకే ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు నిర్మిస్తున్నాం. త్వరలో యంగ్ ఇండియా స్పోర్ట్స్ వర్సిటీ ప్రారంభిస్తాం' అని ఆరుట్ల సభలో అన్నారు.