జిల్లా కలెక్టర్ బడుగు చంద్రశేఖర్ కు వినతి పత్రం అందజేత
అక్రమాలు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలి.
సామాజికవేత్త, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ చింతపల్లి శ్రీనివాస్ గౌడ్ డిమాండ్
విజేత,దేవరకొండ : జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో దేవరకొండ మున్సిపాలిటీ పరిధిలో సర్వేనెంబర్ 657 గల ప్రభుత్వ భూమి కొంతమంది అక్రమంగా కబ్జా చేస్తూ ప్లాట్ల రూపంలో హద్దురాళ్ళు నిర్ణయించి, కొంతమంది ఇండ్లు నిర్మాణం చేసుకొని అక్రమంగా కబ్జాకు గురి అవుతుందని దేవరకొండకు వచ్చిన జిల్లా కలెక్టర్ బడుగు చంద్రశేఖర్ కు ఇట్టి భూమిని కాపాడాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సామాజిక వేత్త, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ చింతపల్లి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ దేవరకొండ మున్సిపాలిటీలో డిండి హైవే రోడ్, ఎల్ఐసి ఆఫీస్ వెనుక భాగాన బంజారా కాలనీ కి తూర్పు భాగాన ఉన్నటువంటి ప్రభుత్వ భూమి కొంతమంది దళారులు, భూ కబ్జాదారులు అక్రమంగా భూమిని ఆక్రమించుకొని కొన్ని ప్లాట్ల రూపంలో హద్దులు నిర్ణయించి ఇతరులకు విక్రయిస్తున్నారని, కొంతమంది గృహ నిర్మాణం చేసుకొని, ప్రభుత్వ భూమిని కాజేస్తున్నారని, దీనివల్ల రోజురోజుకీ ఆ ప్రాంతంలో భూకబ్జా అక్రమ దారుల సంఖ్య పెరిగిపోతుందని గతంలో ఈ విషయంలో ఆర్డీవో, ఎమ్మార్వో, మున్సిపల్ కమిషనర్ వారికి ఫిర్యాదు చేసినప్పటికీ ఎలాంటి పర్యవేక్షణ, స్పందనలేదని జిల్లా కలెక్టర్ తెలపరిచాము. ఆయన స్పందించి ఎంక్వయిరీ చేసి చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ బడుగు చంద్రశేఖర్ తెలిపారు. ఖచ్చితంగా జిల్లా కలెక్టర్ అక్రమ దారుల నుంచి భూమి స్వాధీనం చేసుకొని ప్రజాప్రయోజనాల దృశ్య ఉపయోగం లోకి తెస్తారని,