Logo
Date of Publish : 03 July 2026, 11:46 am
Editor : B. Anil Kumar

ఇబ్రహీంపట్నం మల్లన్న ఆలయంలో చోరీ..హుండీ పగలగొట్టి రూ.50 వేల నగదు ఎత్తుకెళ్లిన దుండగులు

విజేత, ఇబ్రహీంపట్నం : రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం సమీపంలోని మల్లికార్జున స్వామి దేవాలయంలో గురువారం అర్ధరాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు. ఆలయంలోని హుండీని పగలగొట్టి సుమారు రూ.50 వేల నగదును ఎత్తుకెళ్లినట్లు సమాచారం. శుక్రవారం ఉదయం ఆలయానికి వచ్చిన స్థానికులు హుండీ పగలగొట్టి ఉండటం గమనించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆధారాలు సేకరించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గతంలో కూడా ఈ ఆలయంలో దొంగతనం యత్నం జరిగినట్లు స్థానికులు తెలిపారు. పదేపదే చోరీలు జరుగుతుండటంతో ఆలయంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి భద్రత పెంచాలని భక్తులు కోరుతున్నారు.


All Rights Reserved By www.aksharavijetha.com || www.epaper.aksharavijetha.com
Print Save
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • ఈ -పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • Login
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • ఈ -పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • Login

Designed By www.Webdigitalway.com
( 9052933264 )