విజేత,దేవరపల్లి : దేవరపల్లి మండలం లో గౌరీపట్నం గ్రామంలో శ్రీ వెంకటేశ్వర గురుకుల విద్యాలయంలో విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో విద్యార్థులకు లక్ష యువగళ గీతార్చన కార్యక్రమాల భాగంగా ప్రధాన ఉపాధ్యాయురాలు డి. మహాలక్ష్మి అధ్యక్షత న విద్యార్థులకు విశ్వ హిందు పరిషత్ జిల్లా కార్యదర్శి ముత్యాల గంగాధరరావు విధివిధానాలు మరియు భగవద్గీత పారాయణం మరియు పోటీ వివరాలు తెలియజేసినారు మరియు ఆల్ ఇండియా విష్ణు సహస్ర నామ కల్చర్ ఫెడరేషన్ సభ్యులు బలుసు సత్యనారాయణ మాట్లాడుతూ మండల వ్యాప్తంగా స్కూల్లో భగవద్గీత మొదటి 20 శ్లోకాలు పై పోటీ నిర్వహించి ప్రధమం మరియు ద్వితీయ శ్రేణి వచ్చిన విద్యార్థులకు బహుమతి ప్రధానం నిర్వహిస్తాం అని తెలియజేసినారు మరియు పోటీలు పాల్గొనే విద్యార్థులకు ఉచితంగా భవద్గీత పారాయణ బుక్స్ అందించారు ఈ కార్యక్రమంలో మండల బిజెపి కార్యదర్శి నిమ్మగడ్డ శ్రీనివాస్, ఉపాధ్యాయులు సుజాత, రాధా, జోష్నన, వినత తదితరు లు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.
