విజేత,దేవరపల్లి :దేవరపల్లి మండల పరిషత్ నిధుల నుండి ఐదేళ్లలో మండలంలోని 15 గ్రామ పంచాయతీల్లో 11. కోట్ల. 87 లక్షల 94 వేల 870 రూపాయలతో ప్రజలకు మౌలిక సదుపాయాలు. అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని దేవరపల్లి ఎంపీపీ కేవీకే దుర్గారావు తెలిపారు గురువారం మండల పరిషత్ కార్యాలయంలో తమ పాలనలో చేసిన అభివృద్ధి పనులను పత్రిక విలేకరులకు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కులమతాలకు. పార్టీలకు అతీతంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని. అభివృద్ధిలో సహకరించిన అధికారులకు. ప్రజా ప్రతినిధులకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. మండలంలో ఏడు కోట్ల 14 లక్షల 63 691 నిధులతో సిసి రోడ్లు. గ్రావెల్ రోడ్లు నిర్మించామన్నారు. కమ్యూనిటీ బిల్డింగులు నిర్మాణానికి ఒక కోటి 23 లక్షల 46 826 రూపాయలు ఖర్చు చేశామన్నారు. కాంపౌండ్ వాల్స్ రాంపులు నిర్మాణానికి 56 లక్షలు తో అభివృద్ధి చేశామని తెలియజేశారు మండలంలో గ్రామపంచాయతీలో నూతన మోటర్లు ఏర్పాటుకు 85 లక్షల 36 వేల 683 రూపాయిలు నిధులు ద్వారా పూర్తి చేశామని అన్నారు డ్రైనేజీ నిర్మాణానికి 66 లక్షల 83000 ఖర్చు పెట్టామని అదేవిధంగా ఒక కోటి 80 లక్షల రూపాయలు నిధులతో పనులు జరుగుతున్నాయని. అని పేర్కొన్నారు. ఈ ఐదు సంవత్సరాలు గ్రామాల అభివృద్ధిలో సహాయ సహకారాలు అందించిన ప్రజలకు. ప్రజా ప్రతినిధులు. అధికారులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు