విజేత, అగళి : అగళి నూతన తహశీల్దార్గా హరికుమార్ బాధ్యతలు చేపట్టారు. మదనపల్లి కలెక్టరేట్ కార్యాలయం నుంచి పదోన్నతి పై ఇక్కడికి వచ్చినట్లు ఆయన తెలిపారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. కార్యాలయానికి వచ్చే రైతులు, ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని సిబ్బందిని ఆదేశించారు. ఇక్కడి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండ తగిన చర్యలు తీసుకుంటామని తహశీల్దార్ స్పష్టం చేశారు.